పంతం నీదా.! నాదా.!

టీమిండియా కీలక ప్లేయర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్నారు.

ప్రస్తుతం వీరు విశ్రాంతిలో ఉన్నారు.

ఈ నెల 30 నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్ 2023 ద్వారా మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నారు.

ఈ క్రమంలో వీరిద్దరిని ఒక రికార్డు ఊరిస్తోంది.

అదే ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ రికార్డ్

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆసియా కప్ (టి20, వన్డే ఫార్మాట్ లను కలిపి)లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా ఉన్నాడు.

కోహ్లీ 21 మ్యాచ్ ల్లో 1,042 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. సగటు 69.

ఇక రోహిత్ శర్మ 31 మ్యాచ్ ల్లో 1,016 పరుగులు చేశాడు.ఒక సెంచరీ ఉంది. సగటు 40.

ఆసియా కప్ 2023 ముగిసే నాటికి వీరిద్దరిలో ఎవరు అత్యధిక పరుగుల ప్లేయర్ గా నిలుస్తాడో చూడాలి