అమిత్ షా సభకు పోటెత్తిన జనం.. తెలంగాణ బీజేపీలో జోష్..

అమిత్ షా పర్యటనతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో జోష్.

తాజాగా బీజేపీ తెలంగాణ అభ్యర్ధుల ప్రకటన తర్వాత టీ బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తాజాగా అమిత్ షా తెలంగాణ పర్యటనతో అది మరోసారి ఋజువు అయింది.

తెలంగాణలో సూర్యాపేటలో జరిగిన బీజేపీ జన గర్జన సభకు ప్రజలు అమిత్ షా ప్రసంగం వినడానికి పోటెత్తారు.

ఈ సందర్భంగా బీజేపీ అగ్ర నేత కేంద్ర హోం మంత్రి.. రాష్ట్రంలోని బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు.

ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించి సంచలనం రేపారు.

తెలంగాణలో బీజేపీ బలహీనపడినట్లుగా కథనాలు వస్తున్నా.. ఆ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలపై నా సామిరంగ అంటోంది.

ఇది ఒక రకంగా కాంగ్రెస్‌లో కలవరం కలిగిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడదల కావడంతో తెలంగాణ సహా ఎన్నికలు జరిగే రాష్ట్రల్లో ఎన్నికల వేడి రాజుకుంది.

ఈ సందర్భంగా తెలంగాణలోని బీజేపీ నిర్వహించిన జనగర్జన సభ విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి జనాలు పోటెత్తారు.

ఒక రకంగా అమిత్ షా తన పర్యటనతో తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో ఒకింత ఉత్సాహాం నింపారు

తెలంగాణ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కాదన్నట్టు అమిత్ షా సభతో ప్రూవ్ అయింది.

అమిత్ షా పర్యటనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో గుబులు పుట్టించారు