గోల్డెన్ కలర్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తోన్న రష్మిక మందన్న..

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ ఆ తర్వాత కోలీవుడ్ ఇపుడు బాలీవుడ్ బాట పట్టింది.

నేషనల్ క్రష్‌గా అందరికీ సుపరిచితమైన ఈ భామ.

’పుష్ప’తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది.

ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘వారసుడు’ సినిమాతో పలకరించింది.

రష్మిక  టాలీవుడ్ బడా సీనియర్ హీరో సరసన యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది.

ఇలా అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చాటుతోంది.

ఇప్పటికే హిందీలో టాప్ టక్కర్ ఆల్బమ్‌తో ఫేమస్ అయిన రష్మిక.

ఆ తర్వాత ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది.

తాజాగా ఈమె తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ అనే సినిమాలో రణ్‌బీర్ కపూర్‌కు జోడిగా నటించింది.

రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు.

రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S.  రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం,  ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.