అయోధ్య రామ మందిరానికి బంగారు తలుపులు..!

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన నిర్వహించనున్నారు.

దీనికోసం రామమందిర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

రామ మందిర ప్రారంభం రోజు వీఐపీలు అయోధ్య బాట పట్టనున్నారు. 

ప్రధాని మోదీ రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. 

రామమందిర ప్రారంభం కోసం ప్రజలు వేయి కల్లతో ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో రామ మందిరం గురించి ఓ వార్త తెలుస్తోంది. 

అయోధ్యలోని రామ మందిరంలో బంగారు తలుపులు ఏర్పాటు చేశారు.

రామ మందిరంలో ఇలాంటి మరో 13 బంగారు తలుపులు ఏర్పాటు చేయనున్నారు.

ఈ ద్వారాలు 12 అడుగులు పొడవు, 8 అడుగుల వెడల్పు ఉంటాయి. 

ఆలయంలోని అన్ని తలుపులు అద్భుతంగా తయారు చేస్తున్నారు. 

రామ మందిరానికి సంబంధించిన ప్రతి విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.