న్యూస్ 18 ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

బలహీన ఆర్థిక వ్యవస్థ నుంచి బలమైన ఆర్థిక వ్యవస్థకు భారత్!

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 6 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు

న్యూస్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ప్రజల్లో చర్చ జరుగుతున్న పలు విషయాలపై మాట్లాడారు.

నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషి ప్రత్యేక ఇంటర్వ్యూలో నిర్మలా మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనపై ఆర్థికమంత్రి మాట్లాడారు. 

మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.

తమది సెక్యులర్ బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ అన్నారు.

మోదీ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరతాయన్నారు.

సాధికారత, సబ్‌కా సాథ్, సబ్‌కా విశ్వాస్,సబ్‌కా వికాస్ సూత్రాలపై బడ్జెట్ రూపొందించబడిందన్నారు.