వెరైటీగా ఎన్నికల ప్రచారం..

ఎన్నికల ప్రచారంలో ఇతని రూటే సపరేటు..

కరీంనగర్ కు చెందిన కోటా శ్యామ్ కుమార్ కు అభ్యుదయ భావాలు ఎక్కువ.

ఆర్కిటెక్ లో మాస్టర్ పూర్తి చేసిన శ్యామ్‌కు రాజకీయాలలో రాణించాలనే ఆసక్తి ఉంది.

ఓటర్లను డబ్బు, మద్యం తో ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలిపారు. 

అందుకే తనదైన శైలిలో ప్రజలకు ఓటు విలువను చాటి చెబుతున్నారు.

2018 నుండి తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నామినేషన్ వేస్తారు.

మహనీయుల వేషధారణలతో ప్రచారం నిర్వహిస్తారు

ఇప్పటికీ 6సార్లు ఎమ్మెల్యేగా, 4సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 

నా లక్ష్యం మాత్రం ఓటు హక్కు ప్రాధాన్యత ప్రజల్లోకి తీసుకెళ్లడమేనన్నారు.