పాలు తాగేటప్పుడు వీటిని తినకండి.. డేంజర్!

రోజూ పాలు తాగాలని వైద్యులు చెబుతారు. 

అయితే కొన్ని పదార్థాలను పాలతో కలపకూడదని ఆయుర్వేదం చెబుతోంది. 

ఆయుర్వేదం ప్రకారం.. పాలతో ఈ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మిక్స్ చేయకూడదు. 

బ్రెడ్.. బ్రెడ్‌ను మిల్క్‌తో కలిపి తింటే, పొట్టలో అసౌకర్యం కలుగుతుంది.

సిట్రస్ ఫ్రూట్స్.. పాలు తాగిన వెంటనే పుల్లని పండ్లు తింటే అజీర్తి, కడుపు ఉబ్బరం, ఇతర సమస్యలు రావచ్చు.

చేపలు.. ఈ రెండింటి కాంబినేషన్ విషంగా మారే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. 

అరటిపండు.. ఈ రెండింటిని కలిపితే కఫం రావచ్చు. పొట్ట ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుందని ఆయుర్వేదం సూచిస్తోంది.

పుచ్చకాయ.. పొట్టలో ఈ రెండు కలిస్తే జీర్ణ ప్రక్రియ గందరగోళంగా మారుతుంది.

మాంసం.. పాలను, మాంసాన్ని అస్సలు కలపొద్దని ఆయుర్వేదం చెబుతోంది. 

ముల్లంగి.. ఈ కాంబినేషన్‌ జీర్ణక్రియ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే.. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.