ఆలయాలకు లక్షల  విరాళమిస్తున్న బిచ్చగాడు.. ఎక్కడో తెలుసా..?

విజయవాడలో 83 ఏళ్ల పెద్దాయన గొప్పమనసు చాటుకుంటున్నాడు..

సాయి బాబా గుడి దగ్గర యాది రెడ్డి అనే వృద్దుడు భిక్షాటన చేస్తున్నాడు..

ఈయన 16 నుంచి 18 లక్షల రూపాయలను దేవాలయాలకు విరాళంగా ఇచ్చాడు.

యాది రెడ్డి తెలంగాణ రాష్ట్రం నల్గొండకి చెందిన వ్యక్తి..

చిన్న తనంలో తండ్రి దండ్రులు లేక తన పిన్ని వరుస బంధువుల ఇంట్లో ఉండేవాడు.

ఇంటి విషయాలు నచ్చక 1950-60లో ఓ బొగ్గు రైల్ ఎక్కి చిన్న వయసులోనే విజయవాడకు వచ్చారు. 

ఆకలి కారణంగా.. స్థానిక కోదండరాముని గుడి ఎదుట భిక్షాటన చేయటం మొదలు పెట్టాడు.

కొన్నేళ్ల క్రితం ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంగళగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు..

ఈ క్రమంలో అప్పటి నుంచి భిక్షాటనతో వచ్చిన సొమ్మును ఆలయాలకు ఇస్తు వస్తున్నాడు..