విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్.. 

విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

పదిలో 10/10 సాధించిన విద్యార్థులకు అదిరే ఆఫర్ ప్రకటించారు.

ఉన్నత విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తామన్నారు.

ప్రధాని మోదీ, చంద్రబాబు, నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విద్యావిధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.

బడి బాట కార్యక్రమం 20వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వాహణ మహిళా సంఘాలకే ఇచ్చామన్నారు.

విద్యకు కేటాయించే నిధుల్లో ఎక్కువ శాతం జీతాలకే అవుతోందన్నారు.

విద్యపై చేసేది ఖర్చు కాదని. అది పెట్టబడని సీఎం అన్నారు.