TET: మళ్లీ టెట్..

తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త.

తెలంగాణలో మరో టెట్ నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

రాష్ట్రంలో చివరిసారి గతేడాది జూన్‌ 12న విద్యాశాఖ టెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.

విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. 

పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in/ సందర్శించొచ్చు.