తిరుపతి రైళ్లు రద్దు..

దక్షిణ మధ్య రైల్వే ట్రైన్ క్యాన్సిల్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

తిరుపతి కాట్పాడి సెక్షన్‌లో రైళ్ల రద్దు ప్రకటించింది.

అందువల్ల రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఇంజినీరింగ్ వర్క్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ట్రైన్ నెంబర్ 07659 తిరుపతి నుంచి కాట్పాడి వెళ్తుంది.

ఈ రైలు జూన్ 11 నుంచి జూన్ 30 వరకు క్యాన్సిల్ అయ్యింది.

ట్రైన్ నెం 07582 కట్పాడి నుంచి తిరుపతి వెళ్లే రైలు రద్దు అయ్యింది.

జూన్ 11 నుంచి జూన్ 30 వరకు అందుబాటులో ఉండదు.

అందువల్ల ట్రైన్ ప్యాసింజర్లు దీన్ని గమనించాలి.