సింగ్ ఈజ్ కింగ్

టి20 ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది.

ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించి సూపర్ 8కు చేరుకుంది.

అమెరికాతో జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో నెగ్గింది.

ఇక ఈ మ్యాచ్ లో అర్ష్ దీప్ సింగ్ రెచ్చిపోయాడు.

4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

ఈ క్రమంలో అరుదైన రికార్డును నెలకొల్పాడు.

టి20 ప్రపంచకప్ లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.

గతంలో ఈ రికార్డు అశ్విన్ పేరిట ఉండేది.

2014 టి20 ప్రపంచకప్ లో అశ్విన్ ఆసీస్‌పై 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

తాజాగా ఈ రికార్డును అర్ష్ దీప్ సింగ్ బ్రేక్ చేశాడు.