ట్రైన్ టికెట్ ధరలు భారీగా తగ్గింపు!

ట్రైన్ జర్నీ చేయాలని ప్లాన్ చేసే వారికి తీపికబురు. ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది.

రైల్వే మంత్రిత్వ శాఖ టికెట్ ధరలపై డిస్కౌంట్ ప్రకటించింది.

ఏకంగా 25 శాతం వరకు టికెట్ ధరలపై తగ్గింపు అందుబాటులో ఉండనుంది.

సీటింగ్ అకామోడేషన్ ఉన్న ప్రతి ఏసీ ట్రైన్‌కు ఈ టికెట్ ధరల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

గత 30 రోజుల్లో ఆక్యుపెన్సీ 50 శాతం కన్నా తక్కువగా ఉన్న రైళ్లకు ఈ డిస్కౌంట్ స్కీమ్ వర్తింపజేస్తారు.

ఏసీ సిట్టింగ్ అకామోడేషన్ ఉన్న అన్ని ట్రైన్స్‌లో ఏసీ చెయిర్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లకు టికెట్ ధరల డిస్కౌంట్ వర్తిస్తుంది.

టికెట్ బేస్ ఫేర్‌లో గరిష్టంగా 25 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

రిజర్వేషన్ చార్జీలు, సూపర్ ఫాస్ట్ సర్ చార్జ్, జీఎస్‌టీ వంటివి అదనంగా చెల్లించుకోవాలి.

హాలిడేస్, పండుగల సందర్బంగా తీసుకువచ్చే ప్రత్యేక రైళ్లకు ఈ డిస్కౌంట్ స్కీమ్ అందుబాటులో ఉండదు.