ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు నుంచే.. 

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.

కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులేస్తోంది.

ఇప్పటికే సీఎం చంద్రబాబు 5కీలక హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు.

రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ పథకంపై ఇప్పటికే కసరత్తు చేస్తున్నామన్నారు.  త్వరలోనే అమలు చేస్తామని అన్నారు.

ఈ పథకంలో ఎదురవుతున్న లోటుపాట్లు ఏపీలో తలెత్తకుండా చూస్తున్నామన్నారు.

తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రల్లో అధ్యయనం చేస్తామన్నారు.

అనంతరం ఎప్పుడు అమలు చేయబోయేది ప్రకటిస్తామని అన్నారు.

ఎవరికీ ఇబ్బంది కలగకుండా మహిళలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు.

ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు 15 నుండి అమలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.