రోహిత్

ఒకే ఒక్క మొనగాడు..

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతుంది. 

లేటెస్ట్‌గా ఆస్ట్రేలియాను చిత్తు చేసి సెమీస్‌లోకి గర్వంగా అడుగుపెట్టింది.

ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హీరోగా నిలిచాడు.

41 బంతుల్లో 92 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ ఇన్నింగ్స్‌తో పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 200 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 

ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌లను అధిగ‌మించాడు. 

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. 

రోహిత్ శ‌ర్మ 157 మ్యాచుల్లో 4165 పరుగులు చేశాడు. 

అలాగే ఒక జట్టు మీద అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగానూ నిలిచాడు.