ఇద్దరు మొనగాళ్లు..

టీ20 వరల్డ్ కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకుంది.

సౌతాఫ్రికాను ఫైనల్‌లో ఓడించి 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చుకుంది.

టీమిండియాకు ఇది రెండో టీ20 వరల్డ్ కప్.

అయితే, ఈ ఘనత తర్వాత కోహ్లీ, రోహిత్ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు.

కుర్రాళ్లకు ఛాన్సులు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

కానీ రోహిత్, కోహ్లీ ఒక్కసారే రిటైర్ అవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఈ ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గత దశాబ్ద కాలంలో టీమిండియా హీరోలు ఈ ఇద్దరే.

టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసింది ఈ ఇద్దరే.

రోహిత్ శర్మ 4231 పరుగులు చేశాడు.

కోహ్లీ 4188 పరుగులు చేశాడు.