AP: ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం.. 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ రవాణా శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు.

ఈ ఉచిత ప్రయాణంపై త్వరితగతిన అధ్యయనం అవసరమన్నారు.

సాధ్యమైనంత త్వరలోనే ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభింస్తామని ప్రకటించారు.

శ్రీకాకులం జిల్లాలో ఆర్టీసీ అధికారులతో పలు అంశాలపై రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందించాల్సిన ఆర్టీసీ సేవలపై సమగ్రంగా చర్చించారు.

సమావేశంలో అమరావతి, విజయనగరం ఈడీలు, ఆయా కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం అయింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఈ సదుపాయాన్ని కల్పించారు.

ఈ తరహాలోనే ఏపీలో కూడా అమలు చేయనున్నారు.