చెప్పులు పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఎక్కడో తెలుసా..?

దేవాలయాలకు వెళ్లినప్పడు కొన్నిసార్లు చెప్పులు లేదా బూట్లు దొంగిలిస్తుంటారు..

గుడి బైట వదిలి పెట్టి వెళ్లిన చెప్పులను చోరీ చేసే ముఠాలు కూడా ఉంటాయి..

కొన్నిసార్లు తొందరలో ఒకరిచెప్పులను మరోకరు కూడా వేసుకుంటుంటారు..

యూపీలోని కాన్పూర్ కి చెందిన వ్యక్తికి విచిత్రమైన అనుభవం ఎదురైంది..

దబౌలి నివాసి క్రాంతి శరణ్ నిగమ్ ఆదివారం  శ్రీ భైరవ్‌జీ ఆలయానికి వెళ్లాడు..

తిరిగి బైటకు వచ్చి చూస్తే అతని చెప్పులు కన్పించలేదు..

అక్కడ చుట్టుపక్కల ఎంతో వెతికాడు.. కానీ చెప్పులు మాత్రం దొరకలేదు..

దీంతో వెంటనే అక్కడున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెప్పులు పోయాయని ఫిర్యాదు చేశాడు..

పోలీసులు ఎఫైఐఆర్ నమోదు చేయడంతో ఘటన వార్తలలో నిలిచింది..