డబుల్ ఇస్మార్ట్ సినిమాకు రూ.100 కోట్ల లాభాలు..?

పూరి జగన్నాధ్-రామ్ పోతినేని కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్‌పై భారీ అంచనాలున్నాయి.

ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 

ఈ సినిమాకు అక్షరాల రూ.150 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ఇన్ సైడ్ టాక్. 

వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూపంలో రూ.60 కోట్ల మేర డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. 

దీనితో పాటుగా ఆడియో రైట్స్ రూ.9 కోట్లు, సౌత్ డిజిటిల్ హక్కులకు రూ.33 కోట్లు. 

హిందీ డిజిటల్‌తో పాటు శాటిలైట్ హక్కులకు మరో రూ.50 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. 

ఈ లెక్కన పెట్టిన బడ్జెట్‌కు ఆల్రెడీ వంద కోట్ల లాభాల్లోకి ఇస్మార్ట్ శంకర్ వచ్చేసినట్లే.

ఇక లైగర్ దెబ్బతో పూరీ ఈ సినిమాను పరిమిత బడ్జెట్‌లోనే పూర్తి చేశాడు. 

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు రూ.45-50 కోట్ల మధ్యలో బడ్జెట్ అయిందని తెలుస్తుంది. 

ఈ లెక్కన ఆల్రెడీ రూ.100 కోట్ల ప్రాఫిట్ డబుల్ ఇస్మార్ట్‌కు వచ్చేసినట్లే..

లైగర్‌తో భారీ దెబ్బ తిన్న పూరి.. ఈ సారి కంబ్యాక్ ఇవ్వాలని కసితో డబుల్ ఇస్మార్ట్‌ను తెరకెక్కించాడు.