50 సెకన్ల యాడ్ కోసం రూ.5 కోట్లు తీసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్..!

సౌత్‌లో ఇప్పటికిప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరా అంటే గుక్కతిప్పుకోకుండా నయనతార పేరు చెబుతుంటారు. 

మాములుగా ఒక హీరోయిన్ కెరీర్ పది, పదిహేనేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కీలక రోల్స్, సైడ్ రోల్స్ చేసుకోవాల్సిందే.

కానీ సౌత్ క్వీన్ నయనతార మాత్రం అలా కాదు.. ఏజ్ పెరిగినా కొద్ది మరింత గ్లామర్‌తో కనిపిస్తూ రచ్చ లేపుతుంది. 

ఇప్పటికీ సౌత్ టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో మొదటి పేరు నయనతారనే.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపు 11 సినిమాలున్నాయి. 

పాన్ ఇండియా సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్, మీడియం బడ్జెట్ సినిమాలు సైతం చేస్తూ.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటినిస్తుంది.

ఇక ప్రస్తుతం నయనతార యష్‌తో టాక్సిక్, జయం రవితో తని ఓరువన్ 2.. 

మమ్ముట్టి-గౌతమ్ వాసుదేవ మీనన్ ఇలా 11 సినిమాలను లైనప్‌లో ఉంచుకుంది.

కాగా ఈ బ్యూటీ ఓ యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంది.

'టాటా స్కై'లో 50 సెకన్ల యాడ్ కోసం అక్షరాల రూ.5 కోట్లు తీసుకుంది. ఒక హీరోయిన్ ఈ రేంజ్‌లో తీసుకోవడం అంటే మాములు విషయం కాదు.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.10-12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.