విజయవాడ టు షిరిడీ IRCTC స్పెషల్ ప్యాకేజీ..!

విజయవాడ వాసులకు గుడ్ న్యూస్.

షిరిడీకి ప్రత్యేక టూర్ ప్యాకేజీ టూర్ ప్రకటించిన ఐఆర్‌సిటీసి

అతి తక్కువ ధరకే ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

ప్రతీ మంగళవారం విజయవాడనుంచి షిరిడీకి టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది

విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఉదయం 10.15 గంటలకు సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి.

రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు

షిరిడీ చేరుకున్న తర్వాత బాబా ఆలయ దర్శనం.  సాయంత్రం ఖాళీ సమయం.రాత్రికి షిరిడీలో బస చేయాలి.

మూడో రోజు ఉదయం శనిశిగ్నాపూర్ బయల్దేరాలి. ఆ తర్వాత తిరిగి షిరిడీ చేరుకోవాలి.

రాత్రికి షిరిడీలోనే బస చేయాలి.

సాయంత్రం 7.30 గంటలకు షిరిడీ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కితే మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు విజయవాడ చేరుకుంటాం.