Gurukul Results: గురుకుల పీజీటీ, టీజీటీ ఫలితాలు..

తెలంగాణలో గురుకుల పరీక్షలను ఆగస్టు  01వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. 

అయితే వీటి పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ ను ఆగస్టు 23వ తేదీన విడుదల చేశారు. 

ఆగస్టు 03 నుంచి ఆగస్టు 19 వరకు నిర్వహించిన వివిధ విభాగాల పరీక్షలకు సంబంధించి అబ్జెక్షన్స్ కు చివరి తేదీ ఆగస్టు 25తో ముగిసింది. 

ఇదిలా ఉండగా.. అత్యంత వేగంగా గురుకుల పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. 

ఈ నెల చివరి నాటికి ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. 

ఒకవేళ ఈ నెలాఖరుకు కుదరని పక్షంలో సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. 

ఫైనల్ కీతో పాటు.. ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. 

ఒక్క పోస్టుకు ఇద్దరు చొప్పును సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవనున్నారు. 

ముందుగా డీఎల్ పోస్టులను భర్తీ చేసి.. తర్వాత పీజీటీ, జేఎల్, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు.