మన దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలూ చేపలను ఇష్టంగా తింటారు

తీర ప్రాంతాల్లో నివసించే చాలామంది ప్రజల భోజనంలో చేపలు ప్రధాన ఆహారం

రుచితో పాటు చేపల్లో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి

చేపలను ఆహారంలో తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూడండి

మీ డైట్లో చేపలను చేర్చుకుంటే హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు

చేపల నుంచి విటమిన్- డి శరీరానికి తగినంత అందుతుంది

 మానసిక ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి చేపలు సహాయపడతాయి

చేపలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు దరిచేరవు

సాల్మన్, ట్రౌట్, సార్డినెస్, ట్యూనా వంటి చేపలు తింటే మెదడు,కళ్ల పనితీరు మెరుగుపడుతుంది

చేపలు తినడం వల్ల జీవక్రియ, నిద్ర నాణ్యత, చర్మ ఆరోగ్యం, ఏకాగ్రత వంటివి పెరుగుతాయి