బంగారం లాంటీ అవకాశాన్ని మిస్ చేసుకున్న కీర్తి సురేష్..

కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. 

ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.

 కీర్తి సురేష్‌ ఇటీవల తెలుగులో దసరా అనే సినిమాలో నటించింది. 

ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో.. చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్‌లో నటించింది.

ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై డిజాస్టర్ అయ్యింది.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది..

అది అలా ఉంటే కీర్తి సురేష్‌ , నాగ చైతన్య హీరోగా వస్తోన్న ఓ భారీ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నట్లు టాక్ నడిచిన సంగతి తెలిసిందే. 

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా వస్తోంది. 

ఈ సినిమాలో కీర్తిని హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు.. అంతేకాదు ఆమె ఖరారు అయ్యినట్లు వినిపించింది.

అయితే సడెన్‌గా ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకున్నారు దర్శక నిర్మాతలు.

దీనికి కారణం ఆమె భారీగా రెమ్యూనరేషన్ అడిగినట్లు సోషల్ మీడియా టాక్. 

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు.

ఇది కూడా చదవండి. తెలుగు హీరోల రెమ్యూనరేషన్స్..