రైతులకు కేంద్రం అదిరే శుభవార్త.. కీలక ప్రకటన

రైతులకు తీపికబురు. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. 

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏఐ చాట్ బాట్ సేవలు తెచ్చింది. 

ఏక్‌స్టెప్ ఫౌండేషన్, భాషిణి మద్దతుతో ఏఐ చాట్ బాట్ అభివృద్ధి చేశారు

దీని ద్వారా రైతులు వారి అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ వివరాలు తెలుసుకోవచ్చు.

ఇన్ఎలిజిబుల్ స్టేటస్ సమాచారం పొందొచ్చు.

ఇతర పీఎం కిసాన్ స్కీమ్ సంబంధిత అప్‌డేట్లు పొందొచ్చు. 

పీఎం కిసాన్ యాప్ ద్వారా రైతులు ఏఐ చాట్‌బాట్ సర్వీసులు పొందొచ్చు. 

మొబైల్‌లో పీఎం కిసాన్ యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. 

పీఎం కిసాన్ లబ్ధిదారులు వివిధ భాషల్లో చాట్ బాట్ సర్వీసులు పొందొచ్చు. 

ఏఐ చాట్ బాట్ సేవలు ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, ఒడియా, తమిళంలో లభిస్తున్నాయి.

త్వరలో దేశంలోని మొత్తం 22 అధికారిక భాషలలో ఈ సర్వీసులు  లభించనున్నాయి.

 రైతులకు నిర్మలా సీతారామన్ అదిరే శుభవార్త