కీర్తి సురేష్ పెళ్లి సందడి..  

కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. 

ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.

 కీర్తి సురేష్‌ ఇటీవల తెలుగులో దసరా అనే సినిమాలో నటించింది. 

ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో.. చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్‌లో నటించింది.

ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై డిజాస్టర్ అయ్యింది.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది..

అది అలా ఉంటే ఈ భామ తాజాగా తన ఫ్రెండ్ పెళ్లికి హాజరైంది.

అక్కడి నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది.

ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తెలుగులో నాగచైతన్య, చుందూ మొండేటి సినిమాలో నటిస్తున్నట్లు టాక్ నడించింది.. అయితే ఆమె స్థానంలో సాయి పల్లవి వచ్చి చేరింది.

 దీంతో ప్రస్తుతం కీర్తి తెలుగులో ఏ ఒక్క సినిమాలోను నటించడం లేదు..

తమిళ్‌లో మాత్రం ఓ మూడు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.