అక్కడ వాటర్ వేస్ట్ చేస్తే రూ.5000 ఫైన్.. మరి మన సంగతేంటి ?

సమ్మర్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది నీటి కష్టాలు.

రెండు రోజులకు వచ్చే నల్లా నీరు.. వారానికి ఒకసారి వస్తాయి. 

కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రతిరోజు ట్యాంకర్ లేనిది నీటి అవసరాలు తీరవు.

ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అటు ప్రభుత్వాలు సూచనలు చేస్తూ ఉంటాయి.

తాజాగా బెంగళూరులో తాగునీటిని వేస్ట్ చేస్తే రూ.5000 ఫైన్ విధిస్తామని ప్రకటించింది. 

బెంగళూరులో నీటి కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

కార్‌ వాషింగ్, గార్డెనింగ్‌, రోడ్ల నిర్మాణం, సినిమా హాళ్లు వంటి ప్రాంతాల్లో నీటిని వాడడాన్ని నిషేధించారు.

నీటిని  వేస్ట్ చేస్తే ఫైన్ విధించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.

హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఇలాంటి రూల్ పెట్టాలని అంటున్నారు.