5 బ్యాంకులతో డబ్బుల వర్షం

బ్యాంకు షేర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భారీ రాబడిని ఆఫర్ చేస్తున్నాయి.

రూ. లక్ష పెట్టిన వారికి ఏకంగా రూ. 3 లక్షల వరకు లభించాయి.

కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు రూ. 45 నుంచి రూ. 129కు చేరింది. 180 శాతం రాబడి ఇచ్చింది.

అంటే రూ. లక్ష పెట్టిన వారికి దాదాపు రూ.3 లక్షల వరకు వచ్చేవని చెప్పుకోవచ్చు.

కర్నాటక బ్యాంక్‌ స్టాక్ 148 నుంచి రూ. 193కు చేరింది. దాదాపు 30 శాతం పెరిగింది.

గత ఏడాది కాలంలో షేరు ధర రూ. 67 నుంచి రూ. 193కు చేరింది. షేరు 185 శాతం ర్యాలీ చేసింది.

ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేరు ఏడాది కాలంలో రూ. 40 నుంచి రూ. 94కు చేరింది. 135 శాతం పెరిగింది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ఏడాది కాలంలో రూ.33 నుంచి 80కు ఎగసింది. 135 శాతం ర్యాలీ చేసింది.

ఆర్‌బీఎల్ బ్యాంక్ షేరు ఏడాదిలో రూ. 83 నుంచి రూ. 184కు చేరింది. 120 శాతం ర్యాలీ చేసింది.