భద్రాద్రి రామయ్య తిరువీధి సేవలో ఉపయోగించే వాహనాలు ఇవే 

అంకురార్పణం రోజున కల్పవృక్ష వాహనం పై స్వామివారిని ఊరేగిస్తారు..

శ్రీ రాముడిని సార్వభౌమ వాహనంలో దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కల్గుతాయంటారు

గరుడ వాహనంపై స్వామివారు  "ఈ పాదాలను ఆశ్రయించండి' అనే భావనతో ఉంటారంటారు..

చంద్రప్రభ వాహనంపై రామయ్యను దర్శిస్తే మనోమాలిన్యాలు తొలగి పోతాయంటారు..

 రధంలో ఉన్న రామయ్యను దర్శిస్తే పునర్జన్మ ఉండదని. బ్రహ్మ పురాణం పేర్కొంటోంది.

హంస వాహనంపై స్వామివారిని దర్శిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని పురణాల్లో పేర్కొన్నారు.

అశ్వవాహనంలో ఉన్న స్వామివారిని దర్శిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం

సింహవాహనంపై ఉన్న రాముడిని సేవిస్తే కీర్తి కలుగుతుందని భక్తుల నమ్మకం...

సూర్యప్రభపై స్వామిని దర్విస్తే ఆరోగ్యంతో పాటు సకల శుభాలు కలుగుతాయి.

గజ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని పురణాల్లో పేర్కొన్నారు

ఈ శేష సేవలో.. స్వామివారిని దర్శిస్తే సకల భోగ భాగ్యాలు కలుగుతాయి.