ఉదయ్ కిరణ్‌తో సినిమా తర్వాత ఇండస్ట్రీ వదిలెళ్లాలనుకున్న రష్మీ..!

నటిగా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రష్మీ.

ఇక జబర్దస్త్ షోతో ఈ బ్యూటీ కెరీర్‌ను ఒక రేంజ్‌లో మలుపు తిప్పేసింది. 

ఈ బ్యూటీ ‘థాంక్స్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

అయితే ఈ సినిమా రిలీజైన విషయం అప్పట్లో సగం జనాలకు తెలియకుండానే రిలీజై వెళ్లిపోయింది. 

ఆ తర్వాత ఉదయ్ కిరణ్‌తో కలిసి ‘హోలీ’ సినిమా చేసింది.

ఈ సినిమాలో రష్మి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. సునీల్‌తో కలిసి పలు కామెడీ సీన్స్‌లో కూడా కనిపించింది.

బ్రేక్ సంగతి అటుంచితే అసలు ఈ బ్యూటీకి అవకాశాలు రాలేవట.

వచ్చినవి కూడా పెద్దగా స్కోప్ ఉన్న పాత్రలు కావట. 

దాంతో ఈ బ్యూటీ ఇక సినిమా ఫీల్డ్ వద్దు అనుకుని ఇండిస్ట్రీని వదిలి వెల్లిపోవాలనుకుందట. 

ఈ విషయాన్ని రష్మీ గతంలో జరిగిన ఒక ఇంటర్వూలో చెప్పింది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలు మరోవైపు బుల్లితెరపై రాణిస్తుంది.