క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓయో గుడ్ న్యూస్..

ICC వన్డే మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌ మరికొద్ది నెలలలో ప్రారంభం కానుంది.

భారత్ వేదికగా ఈ మెగాటోర్నీ జరగనుంది.

ఈ మెగాటోర్నీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే.. మెగాటోర్నీ జరిగే వేదికల హోటళ్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

అహ్మదాబాద్ లో అయితే.. హాటళ్లని ఫుల్ అయ్యాయి అని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఓయో.

క్రికెట్ కు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.

మ్యాచ్‌లు నిర్వహించనున్న నగరాల్లో 500 కొత్త హోటళ్లను ప్లాట్‌ఫామ్‌లో యాడ్ చేయాలని నిర్ణయించింది.

స్టేడియాలకు చాలా దగ్గరగా ఉండే హోటళ్లను మాత్రమే తమ సేవలో భాగం చేసుకోవాలని ఓయో యోచిస్తోంది. 

దీంతో క్రికెట్ మ్యాచ్‌లు చూడడానికి వచ్చేవారు సమీపంలోని హోటల్‌లను ఓయో ద్వారా ఈజీగా బుక్‌ చేసుకోవచ్చు.