12 మందితో మాజీ ప్రధాని మనవరాలు ఎఫైర్ ..!

90వ దశకంలో ఇండస్ట్రీనీ ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ మనీషా కొయిరాలా. 

అప్పట్లో ఈ నటి సినిమా చేసిందంటే బంపర్ హిట్టు అనే నమ్మకం దర్శఖ నిర్మాతల్లో ఉండేది. 

సౌత్‌లో పెద్దగా సినిమాలు చేయలేదు కానీ.. నార్త్ లో మాత్రం ఈ సీనియర్ హీరోయిన్ హవా ఓ రేంజ్ లో ఉండేది.

రీసెంట్గా ఈ అమ్మడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

ఇక మనీషా కొయిరాల సినీ జీవితం ముందు నుంచి వివాదాల మధ్య నే నడిచింది. 

కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ పలువురితో డేటింగ్ చేసినట్లు రూమర్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.

పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. 

ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. 

వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌.. ఇలా 12 మంది పలువురు స్టార్ సెలబ్రెటీలతో ఎఫైర్ నడిపింది.

ఈ బ్యూటీ 2010లో సామ్రాట్ దహాల్ను పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. 

పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి మద్యానికి బానిసైంది.