మరో 78 పరుగులు

భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.

అంతర్జాతీయ వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు కేవలం 78 పరుగుల దూరంలో ఉన్నాడు

246 వన్డేల్లో 9,922 పరుగులు చేశాడు. సగటు 48.88గా ఉంది.

మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఆసియాకప్ లో ఆడుతున్న రోహిత్ శర్మ నేపాల్ పై అర్ధ సెంచరీతో రాణించాడు.

మరో 78 పరుగులు చేస్తే భారత్ ను 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో బ్యాటర్ గా నిలుస్తాడు.

వన్డేల్లో భారత్ నుంచి సచిన్,  గంగూలీ, ద్రవిడ్, కోహ్లీ, ధోనిలు మాత్రమే 10వేల పరుగులను పూర్తి చేశారు.

సెప్టెంబర్ 10న పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది.