2011-2023 : ఒకే ఒక్కడు

2011లో సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ లో టీమిండియా చాంపియన్ గా నిలిచింది.

ఆ తర్వాత మళ్లీ భారత్ ఆ ఘనతను రిపీట్ చేయలేదు.

ఇక మరోసారి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది.

వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది.

2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన టీమ్ నుంచి కేవలం ఒక్క ప్లేయర్ మాత్రమే 2023 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు.

అతడెవరో కాదు విరాట్ కోహ్లీ

2011 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి తొలి ప్రపంచకప్

ఫైనల్లో గంభీర్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు.

2023 వన్డే ప్రపంచకప్ లో కోహ్లీ కీలకం కానున్నాడు.