క్రికెట్ రారాజు

విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించాడు.

పాకిస్తాన్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కాడు.

ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

పాక్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 122 పరుగులతో చెలరేగాడు.

ఈ క్రమంలో వన్డేల్లో 13వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు సాధించిన ప్లేయర్ నిలిచిన కోహ్లీ

ఈ మైలు రాయిని సాధించేందుకు కోహ్లీకి కేవలం 267 ఇన్నింగ్స్ లు మాత్రమే అవసరం అయ్యాయి.

సచిన్ 13 వేల పరుగులను తన 321వ ఇన్నింగ్స్ లో సాధించాడు.

సచిన్ కంటే 54 తక్కువ ఇన్నింగ్స్ ల్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు