మరో 175 పరుగులు

విండీస్ తో టెస్టు సిరీస్ ముగిసింది.

వన్డే సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతుంది.

ఈ క్రమంలో తొలి వన్డే జూలై 27న జరగనుంది.

ఈ వన్డే సిరీస్ కు ముందు రోహిత్ ను అరుదైన రికార్డు ఊరిస్తోంది.

వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయికి రోహిత్ కేవలం 175 పరుగుల దూరంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ ఇప్పటి వరకు 243 వన్డేల్లో 9,825 పరుగులు చేశాడు.

ఇందులో 30 సెంచరీలు.. 48 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మూడు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం.

భారత్ తరఫున ఇప్పటి వరకు కేవలం ఐదుగురు మాత్రమే వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు.

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, గంగూలీ, ద్రవిడ్, ధోని మాత్రమే ఈ ఘనత సాధించారు.

రోహిత్ మరో 175 పరుగులు చేస్తే 10 వేల మార్కు అందుకున్న ఆరో భారత ప్లేయర్ అవుతాడు.