కుర్రాళ్లోయ్.. కుర్రాళ్లు

జింబాబ్వే పర్యటనలో యువ భారత్ మెరిసింది.

సీనియర్లు లేకపోయినా అదరగొట్టేసింది.

ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 4-1తో సొంతం చేసుకుంది.

ఈ సిరీస్ లో అదరొట్టిన టీమిండియా స్టార్స్ ఎవరో చూద్దాం

1. శుబ్ మన్ గిల్ : 5 మ్యాచ్ ల్లో 170 పరుగులతో సిరీస్ లో అత్యధిక పరుగులు చేశాడు.

2. యశస్వి జైస్వాల్ : ఆడిన 3 మ్యాచ్ ల్లో 141 పరుగులు చేశాడు.

3. అభిషేక్ శర్మ : సెంచరీతో కదం తొక్కాడు. అంతర్జాతీయ టి20ల్లో టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు.

4. రుతురాజ్ గైక్వాడ్ : 3 ఇన్నింగ్స్ ల్లోనే 133 పరుగులు చేశాడు.

5. వాషింగ్టన్ సుందర్ : బ్యాట్, బంతితో రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.

6. ముకేశ్ కుమార్ : 8 వికెట్లతో మెరిశాడు.