డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

ఇటీవల డిఫెన్స్ రంగంలో భారీగా నియామకాలు జరుగుతున్నాయి. 

తాజాగా గ్రాడ్యుయేషన్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో జాబ్ నోటిఫికేషన్ వెలువడింది.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కోసం ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

www.joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

జులై 5 అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, ఆగస్టు 3తో ఈ గడువు ముగియనుంది.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఇండియన్ ఆర్మీ మొత్తం 55 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

అభ్యర్థుల వయసు 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం www.joinindianarmy.nic.in కి వెళ్లండి.