ముమ్మరంగా ఖరీఫ్ పనులు...బిజీగా రైతులు

రబీ సీజన్ ముగిసింది.ఖరీఫ్ సీజన్ వచ్చేసింది.

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగు పనులకు సమాయత్తమయ్యారు.

కొందరు ముహుర్తం చూసుకొని విత్తనాలు కూడా వేసుకున్నారు.

మృగశిరకార్తె తో రైతులు ఖరీఫ్ సాగు పనులను ముమ్మరం చేశారు.

దుక్కులు దున్ని విత్తనాలు అలుకుతున్నారు.

అత్యధికంగా ఒక్క పత్తి పంటనే ఎక్కువగా ఉండొచ్చు.

ఇప్పటి వరకు నాలుగు రోజులు మాత్రమే వర్షం కురిసింది.

ఇంకా పూర్తి స్థాయిలో వ్యవసాయ భూముల్లో తేమ శాతం పెరగనే లేదు.

రుతు పవనాలు విస్తరిస్తున్నాయని పత్తి రైతులు విత్తనాలు వేసుకున్నారు.