తక్కువ టైంలోనే మీ డబ్బులు డబుల్ చేసే స్కీమ్..

ప్రజలకు మెరుగైన ఆదాయం అందించే స్కీమ్‌ ఒకటి ఉంది.

ఆ స్కీమే పోస్టాఫీస్‌లు అందించే కిసాన్ వికాస్ పత్ర.

ఈ పొదుపు పథకం ప్రస్తుత వడ్డీ రేటు 7.5 శాతం..

ఈ స్కీమ్ ప్రకారం కేవలం 115 నెలల్లో మీ పెట్టుబడి రెట్టింపు..

కిసాన్ వికాస్ పత్ర అనేది పోస్టాఫీసు అందించే రిస్క్-ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్..

దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. 

స్కీమ్‌లో రూ.50,000 ఇన్వెస్ట్‌ చేస్తే, మెచ్యూరిటీ తర్వాత రూ.1,00,000 అందుతుంది.

KVP అకౌంట్‌ను సింగిల్‌గా ఓపెన్‌ చేయవచ్చు 

లేదా ముగ్గురు పెద్దలు కలిసి జాయింట్‌గా KVP అకౌంట్‌ తెరవవచ్చు.

అర్హత ఉన్న వ్యక్తి ఎన్ని అకౌంట్‌లు అయినా ఓపెన్‌ చేసుకోవచ్చు.

కిసాన్ వికాస్ పత్ర రిటర్న్స్‌పై పన్ను చెల్లించాలి.