ఎక్కువగా నీరు తాగడం వల్ల వచ్చే ప్రమాదాలు ఇవే..?

అధిక నీరు రక్తంలో సోడియం స్థాయిలను పలుచన చేస్తుంది. దీని కారణంగా కణాలలో వాపు వస్తుంది.

ఓవర్‌హైడ్రేషన్ వికారం, వాంతులు, కడుపు నొప్పికి కారణమవుతుంది.

ఎక్కువ నీరు తాగడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. 

మెదడు ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది.

నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది.

ఎక్కువగా నీటిని తాగితే అలసటకు దారితీస్తుంది.

ఓవర్‌హైడ్రేషన్ చేతులు, పాదాలు, ఇతర శరీర భాగాలలో వాపుకు కారణం కావచ్చు.

ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రవిసర్జన ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. 

మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.

దాహం అనిపించినప్పుడు మాత్రమే నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

అనవసరంగా బలవంతంగా నీరు తాగడానికి ప్రయత్నించవద్దని సలహా ఇస్తున్నారు.