బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం

బంగారు ఆభరణాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా బంగారం దిగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది.

ఎంపిక చేసిన గోల్డ్ జువెలరీ, ప్రొడక్టుల దిగుమతులపై నియంత్రణ తీసుకువచ్చింది.

ఈ మేరకు డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్  ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

 పలు ఆభరణాలు ఉచిత కేటగిరి నుంచి పరిమిత కేటగిరి కిందకు మార్చారు.

సంబంధిత బంగారు ఆభరణాలను దిగుమతి చేసుకోవాలని భావిస్తే లైసెన్స్ కలిగి ఉండాలి.

ఇండోనేసియా నుంచి బంగారం దిగుమతులు పెరగడం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇండోనేసియా నుంచి పలు బంగారు ఆభరణాలు సుంకాలు లేకుండా దిగుమతి అవుతున్నాయి.

వాటిని మన దేశంలో కరిగించి, బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారు.