క్రికెట్ మాన్‌స్టర్.. 

42 ఏళ్ల వయసులోనూ ధోని విశ్వరూపం చూపిస్తున్నాడు.

లేటెస్ట్‌గా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో అదరగొట్టాడు.

కేవలం నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు బాది.. 20 పరుగులతో అజేయంగా నిలిచాడు ధోని.

ధోని స్ట్రైక్‌రేట్ 500.

దీంతో.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు మహీ.

ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్ని సిక్సర్లుగా కొట్టిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.

ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ఆటగాడు ధోనినే.

ఇక.. ఈ అరుదైన మైలురాయిని సాధించిన మూడో ఆటగాడు.

గతంలో సునీల్ నరైన్, నికోలస్ పూరన్ ఈ ఘనత సాధించారు.

ఇక, ధోని మెరుపుల్ని చూసిన అభిమానులు క్రికెట్ మాన్‌స్టర్ అంటూ పొగుడుతున్నారు.