హైదరాబాద్లో విస్కీ ఐస్క్రీమ్.. తింటే ఇక అంతే?
హైదరాబాద్లో కొత్త రకం దందా చేస్తున్న ముఠా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతుండడంతో కొత్త రకం మోసాలకు కొందరు కేటుగాళ్లు తెరలేపారు.
గుట్టుచప్పుడు కాకుండా చిన్నారుల నుంచి పెద్దవారి వరకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు.
ఐస్క్రీమ్ రూపంలో ఎవరికీ అనుమానం రాకుండా మత్తు మందు కలిపి అమ్ముతున్నారు.
జూబ్లీహిల్స్లోని ఓ పార్లర్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఈ విస్కీ ఐస్క్రీమ్ల దందా గుట్టురట్టయ్యింది.
రోడ్డు నెంబరు 1 లో వన్ అండ్ ఫైవ్ పార్లర్లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించగా.. విస్కీ ఐస్క్రీమ్లు బయటపడ్డాయి.
ఐస్క్రీమ్లో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్నట్టు గుర్తించారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మిల్లీలీటర్ల విస్కీని కలుపుతున్నట్టు సోదాలు చేసిన అధికారులు గుర్తించారు.
సోదాలు చేస్తున్న సమయంలో 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
1 అండ్ 5 అరికో కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వీటి టేస్ట్ బాగుండడంతో యువత, చిన్నారులు వీటిని ఎగబడికొంటున్నారు. దీంతో వారికి తెలియకుండానే మత్తుకు అలవాటు అవుతున్నారు.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు