రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్..

భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 

కేవలం పదో తరగతి అర్హతతో అప్రెంటీస్‌ అవకాశం కల్పిస్తోంది. 

ఈస్టర్న్‌ రైల్వే (ER) విభాగం అప్రెంటీస్‌ ట్రైనింగ్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

ఈస్టర్న్‌ రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.rrcer.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ విండో సెప్టెంబర్ 24 ఉదయం 11 గంటలకు ఓపెన్‌ అవుతుంది. 

అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటలకు క్లోజ్‌ అవుతుంది. 

ఎంపికైన అభ్యర్థులు ప్రతినెలా రూ. 10,000 వరకు స్టైఫండ్‌ పొందవచ్చు.

మొత్తం 3,115 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. 

కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

NCVT/SCVT నుండి నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా పొంది ఉండాలి. 

అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి.