రైల్వేలో 2400 ఉద్యోగాలు..

పదో తరగతి, ఐటీఐ అర్హతతో సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. 

ఆసక్తి ఉన్న వారు అధికారిక పోర్టల్ rrccr.com లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ఆగస్టు 28న ప్రారంభమైంది. 

ఈ గడువు సెప్టెంబర్ 28న ముగుస్తుంది. 

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 2409 పోస్టులు భర్తీ కానున్నాయి. 

అభ్యర్థుల వయసు 2023 ఆగస్టు 29 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 50 శాతం మార్కులతో పదో తరగతి పాసై ఉండాలి. 

నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ తప్పనిసరి.

అభ్యర్థులను మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికయ్యే వారికి నెలకు రూ. 7000 స్టైఫండ్ లభిస్తుంది.

పూర్తి వివరాల కోసం అధికారిక పోర్టల్ rrccr.comకి లాగిన్ అవ్వండి.