సరిపోదా శనివారం బ్రేక్ ఈవెన్ టార్గెట్...?

మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న సరిపోదా శనివారం సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.

ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశాయి. 

ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీటేయిల్స్ షాక్‌కు గురి చేస్తున్నాయి. 

ఈ సినిమాకు మొత్తంగా రూ.41 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ఇన్ సైడ్ టాక్. 

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.25 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. 

కాగా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలంటే రూ.42 కోట్ల వరకు కొల్లగొట్టాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తుంటే… కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా, ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది.

ప్రియాంక అరుళ్ మోహన్.. హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జే. సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. 

ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్, దానయ్య డీవీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 

ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుక్కుంది. 

హక్కుల కోసం ఏకంగా రూ.45 కోట్లు ఆఫర్ చేసిందని ఇన్ సైడ్ టాక్.