2025లో శనిగ్రహ వలయాలు అదృశ్యం.. నాసా మాట!

మన సౌర వ్యవస్థలోని గ్రహాలలో శని చాలా ప్రత్యేకమైనది.

వలయాలు శనిగ్రహాన్ని ఇతర గ్రహాల కంటే భిన్నమైనదిగా చేశాయి.

శనిగ్రహ వలయాలు 2,82,000 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి.

అయినప్పటికీ మామూలు కంటితో చూస్తే ఈ వలయాలు కనిపించవు.

పవర్‌ఫుల్ టెలిస్కోప్‌తో చూస్తే మాత్రం వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి.

రెండేళ్ల తర్వాత ఈ రింగులు కనిపించడం మానేస్తాయన్న వాదన వినిపిస్తోంది.

ఆప్టికల్ ఇల్యూషన్ కారణంగా 2025లో భూమికి ఈ వలయాలు కనిపించవని ఓ రిపోర్టు చెబుతోంది.

ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ధృవీకరించింది.

వలయాలు కనిపించకపోవడానికి కారణం శని గ్రహం భూమితో కలిసిపోవడమే.

శనిగ్రహం ప్రస్తుతం భూమికి 9 డిగ్రీల కోణంలో వంగి ఉంది. 2024 నాటికి, శని కోణం 3.7 డిగ్రీలకు తగ్గుతుంది.

2025 నాటి శని కోణం భూమికి సమానమవుతుంది. అందువల్ల రింగ్స్ ఉన్నా, భూమి నుంచి చూస్తే కనిపించవు.