Ration Card: రేషన్‌కార్డుదారులకు భారీ శుభవార్త.. 

రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

రేషన్‌కార్డు దారులందరికీ రాగులు కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాకినాడ జిల్లాలో పౌరసరఫరాలశాఖ  70 టన్నుల రాగులను  సిద్ధం చేసింది.

ఒక్కో రేషన్ కార్డుకు మూడు కిలోల చప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఒక రేషన్ కార్డులో ముగ్గురు సభ్యులు ఉంటే.. 12 కిలోల బియ్యం, 3 కిలోల రాగుల చొప్పున అందించనున్నారు.

రాగులను కాకినాడ అర్బన్‌, కాకినాడ రూరల్‌, ఏలేశ్వ రం టౌన్‌ ప్రాంతాల్లో ఉన్న డీలర్ల ద్వారా అందజేస్తున్నారు.

జిల్లాలోని రాగులకు సంబంధించి డిమాండ్ ను బట్టి.. మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నారు.

దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.