ఎడ్ల ద్వారా అధిక ఆదాయం

పత్తి సాగుకు ట్రాక్టర్‌తో గుంటుక కొడితే గడ్డి సరిగా ఉడుతలేదు.

మూలల దగ్గర చెట్లు కూడా తొక్కుతుంది.

ప్రస్తుతం ఆధునిక కాలంలో ఎడ్లనేవి కరువైపోయినాయి.

అందరూ యంత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు.

కొంతమంది రైతులు ఎడ్లతో గుంటక తోలిస్తున్నారు.

ఎకరానికి 1500 నుంచి 2 వేల రూపాయలు తీసుకుంటారు.

రైతుకు రోజుకు రూ.5000 వరకు ఆదాయం ఉంటుంది.

యంత్రాల కాలంలో మనుషులు సోమరిపోతులు అవుతున్నారు.

ఎడ్లతో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడి వస్తుందన్నారు.